జొహర్(మలేషియా): వరుస విజయాలతో అదరగొట్టిన భారత జూనియర్ హాకీ జట్టు.. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం గ్రేట్ బ్రిటన్తో జరిగిన పోరును భారత్ 5-5తో ‘డ్రా’ చేసుకుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (13 పాయింట్లు) టాప్ ప్లేస్ దక్కించుకుంది. చివరి పోరులో భారత్ తరఫున శర్దానంద్ తివారీ (56వ, 58వ ని.ల్లో) రెండు గోల్స్ కొట్టగా.. పూవన్న (7వ ని.), అమన్దీప్ (50వ ని.), అరైజీత్ సింగ్ (53వ ని.) ఒక్కో గోల్ చేశారు.