ముంబై: బౌలర్లు సత్తాచాటడంతో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో భారత అమ్మాయిలు విజయం సాధించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.
గెర్కెన్ (22) టాప్ స్కోరర్ కాగా.. మన బౌలర్లలో హర్లీ 3, సోనమ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సౌమ్య తివారి (33 బంతుల్లో 52 నాటౌట్; 10 ఫోర్లు) దంచికొట్టడంతో భారత్ 11.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (8) ఎక్కువ సేపు నిలువలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం జరుగనుంది.