కువైట్ సిటీ: ఫిఫా ప్రపంచకప్(2026) రెండో రౌండ్ క్వాలిఫయర్స్లో భారత ఫుట్బాల్ జట్టు అదరగొట్టింది. గురువారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్లో భారత్ 1-0తో కువైట్పై అద్భుత విజయం సాధించింది. తొలి అర్ధభాగం ఎలాంటి గోల్ లేకుండా ముగియగా, ద్వితీయార్ధం ఆఖర్లో మన్వీర్సింగ్(75ని) సూపర్ గోల్తో జట్టుకు గోల్ అందించాడు.
లాల్జువాల నుంచి పాస్ అందుకున్న మన్వీర్..ప్రత్యర్థి డిఫెండర్లను కంగుతినిపిస్తూ గోల్గా మలిచాడు. టీమ్ఇండియా ఈ నెల 21న భువనేశ్వర్లో ఏషియన్ చాంపియన్స్ ఖతార్తో తలపడుతుంది. గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు మూడో రౌండ్లోకి ప్రవేశిస్తాయి. ఖతార్, కువైట్, అఫ్గానిస్థాన్తో కలిసి భారత్..గ్రూపు-ఏ లో కొనసాగుతున్నది.