న్యూఢిల్లీ: యూఎఈ ఆతిథ్యమివ్వనున్న ఆసియాకప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ఈనెల 8న ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియాకప్ను ఈసారి టి20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనున్నది. సర్జరీ అనంతరం కోలుకుంటున్న లోకేశ్ రాహుల్ జింబాబ్వే పర్యటనకు దూరమైనప్పటికీ ఆసియాకప్కు అందుబాటులో ఉండగలడని భావిస్తున్నారు.
కాగా సెలెక్టర్లు ఎప్పటివలె 15 మందిని ఎంపిక చేస్తారా లేక 17 మందిని ఎంపిక చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అక్టోబర్లో జరుగనున్న టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేయనున్నారు. ప్రపంచకప్కు ముందు జరిగే పలు మ్యాచ్లలో జట్టు మేనేజ్మెంట్ పలు కాంబినేషన్లను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్టు తెలిసింది.
కాగా కోహ్లి ఫామ్లో లేకపోవడం జట్టును తీవ్రంగా బాధిస్తున్నది. అయితే అతడు తన పూర్వ వైభవాన్ని అందుకోగలడని కెప్టెన్ రోహిత్శర్మ కోహ్లికి అండగా నిలవడం సానకూలాంశం. ఇప్పట్లో కోహ్లి స్థానానికి ఢోకాలేదు. మిడిలార్డర్లో పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టుకు వెన్నెముకలా ఉన్నారు. బౌలింగ్ భారాన్ని భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ పంచుకోనున్నారు. ప్రధాన జట్టుతోపాటు కొందరు బ్యాకప్ ఆటగాళ్లనుకూడా ఎంపిక చేయనున్నారు.