న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్లో పర్యటించనుంది. టీ20 ప్రపంచకప్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ జూన్లో ఐర్లాండ్తో తలపడనుంది. వాస్తవానికి జూన్లో ఆఫ్ఘానిస్థాన్తో ఏకైక టెస్టుతో పాటు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి 19 తేదీ మధ్య ఇంగ్లండ్తో ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది.
అయితే ఆఫ్ఘానిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ విషయాన్ని ఐర్లాండ్స్ హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్ గ్రహమ్ వెస్ట్ పేర్కొన్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో ఐర్లాండ్ టీ20 కెప్టెన్సీ నుంచి పాల్ స్టిర్లింగ్ తప్పుకున్నాడు. 2028 టీ20 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాలన్న పట్టుదలతో ఉన్న ఐర్లాండ్ ఆ దిశగా నాయకత్వ మార్పులకు సిద్ధమైంది.