India | న్యూఢిల్లీ: శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత అంధుల క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన ఆఖరిదైన ఐదోమ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.
నకుల బద్యనాయక్(39 బంతుల్లో 70) ధనాధన్ అర్ధసెంచరీతో విజృంభించాడు. బద్యనాయక్తో పాటు గుడడప్ప (40), దుర్గారావు (49) రాణించారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లంక 137/7 స్కోరుకు పరిమితమైంది. దుర్గారావు, నీలేశ్యాదవ్, సంజయ్కుమార్ ఒక్కో వికెట్ తీశారు. బద్యనాయక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.