హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తమ మధ్య వాణిజ్య వివాదానికి సంబంధించిన కేసులను పరిగణనలోకి తీసుకోకుండా ఆస్తులను జప్తు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్లో కింది కోర్టు తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇచ్చిందని హెచ్సీఏ అడ్మినిస్ట్రేటర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు.
విశాఖ ఇండస్ట్రీస్కు రూ.40 కోట్లు చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్ అవార్డు జారీ అయిందని వివరించారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయించామని అది విచారణలో ఉండగానే ఆర్బిట్రేషన్ అవార్డు అమలు కోసం విశాఖ ఇండస్ట్రీస్ కింది కోర్టుకు వెళ్లిందని తెలిపారు. ఈ కేసులో తమ వాదన వినకుండానే ఆర్పిటేషన్ అవార్డు వెలువడిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.