క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్, శ్రీలంక మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిపత్యం చేతులు మారుతున్న పోరులో శ్రీలంక 65 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. బ్లెయిర్ టిక్నర్(3/28) ధాటికి లంక రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 83 పరుగులు చేసింది. మాథ్యూస్(20), ప్రభాత్ జయసూర్య(2) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 162/5 మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్ 373 పరుగులు చేసింది. ఓవర్నైట్ బ్యాటర్ డారిల్ మిచెల్(102) సెంచరీతో కదంతొక్కాడు. అసితా ఫెర్నాండో (4/85), లాహిరు కుమార (3/76) రాణించారు.