హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న మల్లయుద్ధ పోటీలు ఆఖరి దశకు చేరుకున్నాయి. ముకేశ్గౌడ్ స్మారక రెజ్లింగ్ టోర్నీలో ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. శనివారం జరిగిన పురుషుల 55 కిలోలు, 60కిలోలు, 66 కిలోల విభాగపు పోటీలు ఆఖరి వరకు రసవత్తరంగా సాగాయి. మొత్తం 17 విభాగాల్లో జరుగుతున్న టోర్నీలో దాదాపు 700 మంది రెజ్లర్లు పోటీపడుతున్నారు. టోర్నీలో మహిళలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నారు.