లండన్: వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోమవారం జట్టును ప్రకటించింది. భారత పిచ్లు స్పిన్కు సహకరించనున్న నేపథ్యంలో ఇద్దరు యువ స్పిన్నర్లు బషీర్, హార్ట్లీకి 16 మందితో కూడిన జట్లులో చోటు కల్పించింది.
స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఇంగ్లిష్ టీమ్కు సారథ్యం వహించనుండగా.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్, జో రూట్తో పాటు బెయిర్స్టో, బ్రూక్, క్రాలీ, డకెట్, ఫోక్స్, లీచ్, పోప్, రాబిన్సన్, మార్క్ వుడ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్, ఇంగ్లండ్ మధ్య వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా.. తొలి పోరుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది.
ఇంగ్లండ్ టెస్టు జట్టు: స్టోక్స్ (కెప్టెన్), రెహాన్, అండర్సన్, అకిన్సన్, బెయిర్స్టో, బషీర్, బ్రూక్, క్రాలీ, డకెట్, ఫోక్స్, హర్ట్లీ, లీచ్, పోప్, రాబిన్సన్, రూట్, వుడ్.