ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా అందజేసే ‘నమన్’ అవార్డులను శనివారం ప్రకటించింది. భారత క్రికెట్కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్ (కల్నల్ సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్), మిథాలీ రాజ్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనుంది. నిరుడు భారత మెన్స్ టెస్ట్, వన్డే జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్కు 2024-25 ఏడాదికి గాను బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ అవార్డు దక్కగా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన ఎంపికైంది.
తెలుగమ్మాయి శ్రీచరణి బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ క్రికెటర్ అవార్డుకు ఎంపికవగా పురుషుల విభాగంలో ఈ అవార్డు హర్షిత్ రాణాను వరించింది. ఈ అవార్డులతో పాటు ఇటీవల ఐసీసీ ట్రోఫీలు గెలిచిన (2025లో చాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే ప్రపంచకప్ 2025, ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్, మెన్స్ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్, మెన్స్ టీ20 వరల్డ్ కప్-2025) విజేతలను కూడా ఈ సందర్భంగా బీసీసీఐ ఘనంగా సత్కరించనుంది.