షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2లో భారత రికర్వ్ ఆర్చర్లు సంచలన ప్రదర్శనతో సత్తాచాటి ఈ టోర్నీలో దేశానికి తొలి పతకాన్ని ఖాయం చేశారు. రికర్వ్ టీమ్ ఈవెంట్లో భారత్.. సెమీస్ పోరులో పటిష్టమైన దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్కు అర్హత సాధించింది.
వెటరన్ ఆర్చర్ దీపికా కుమారి, అంకితా భకత్, కుమ్కుమ్ మొహద్తో కూడిన భారత త్రయం గురువారం జరిగిన సెమీస్లో 5-1 (58-55, 56-56, 58-56)తో కొరియాకు షాకిచ్చి ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్.. చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది.