ఆంధ్రతో రంజీ మ్యాచ్
విజయనగరం: మిడిలార్డర్ రాణించడంతో హైదరాబాద్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేసింది. రికీ భుయ్ (116), కరణ్ (105 నాటౌట్), శ్రీకర్ భరత్ (89) సత్తాచాటడంతో రెండో ఇన్నింగ్స్లో ఆంధ్ర 462 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ 3 వికెట్లు పడగొట్టగా.. కార్తికేయ, శశాంక్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 401 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్.. గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (21), ప్రజ్ఞయ్రెడ్డి (0) ఔట్ కాగా.. రోహిత్ రాయుడు (46), అలంకృత్ అగర్వాల్ (7) క్రీజులో ఉన్నారు. శుక్రవారం ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 8 వికెట్లు ఉన్న హైదరాబాద్ విజయానికి 326 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులు చేయగా.. హైదరాబాద్ 197 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యం దక్కించుకుంది.