Gavaskar On Kohli | శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కొత్తగా అనిపించిందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్తో రెండో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కోహ్లీ విలువైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు.
‘విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో చాలా డెలికేట్ షాట్స్ కొట్టాడు. అతడు కట్, గైడ్ షాట్స్ ఆడటం ఆడటం చాలా అరుదు. కానీ, ఈ మ్యాచ్లో కోహ్లీ అలాంటి షాట్లు ఆడటం కొత్తగా ఉంది. బంతిని బాదడమే లక్ష్యంగా క్రీజ్లోకి వచ్చినట్లనిపించింది. మొదట్లోనే టీం ఇండియా వికెట్ కోల్పోయిన వేళ కోహ్లీ.. వెస్టిండీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు’ అని చెప్పాడు.
‘కోహ్లీ తన దూకుడైన బ్యాటింగ్తో కెప్టెన్ రోహిత్ శర్మపై ఒత్తిడి తగ్గించాడు. ఈ మ్యాచ్లో పరుగులు చేయడానికి రోహిత్ కాసింత ఇబ్బంది పడ్డాడు. ఎవరో ఒకరు బాధ్యతలు తీసుకోవాల్సిన టైంలో కోహ్లీ ముందుకు వచ్చి చకచకా పరుగులు చేస్తూ రోహిత్పై ఒత్తిడిని తగ్గించాడు’ అని లిటిల్ మాస్టర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే యువ క్రికెటర్ రిషబ్పంత్ను లోయర్ ఆర్డర్లో పంపితే మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడని మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా చెప్పాడు. తక్కువ ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగ్కు దింపితే మెరుగ్గా రాణిస్తాడన్నాడు.