మార్గవో(గోవా): గోవా వేదికగా 37వ జాతీయ క్రీడలకు తెరలేచింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం నేషనల్ గేమ్స్ ప్రారంభ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. విద్యుత్దీప కాంతులకు తోడు పటాకుల వెలుగు, జిలుగుల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. దేశంలోని వివిధ రాష్ర్టాలకు తోడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 10వేల మందికి పైగా అథ్లెట్లు ఇందులో పోటీపడుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి 28 వేదికల్లో 43 క్రీడా విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. నేషనల్ గేమ్స్ మార్చ్పాస్ట్లో పుష్ప సెంథిల్కుమార్ తెలంగాణ పతాకధారిగా వ్యవహరించింది.