రాంచీ: అమెరికా ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్(Terrorist Pannun) వార్నింగ్ నేపథ్యంలో ఇంగ్లండ్, ఇండియా మధ్య రాంచీలో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్కు భారీ భద్రతను పెంచారు. రాంచీ టెస్టును చెదరగొట్టేందుకు ఆ ఉగ్రవాది ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాంచీలో భారీ సంఖ్యలో భద్రతను పెంచారు. పన్నున్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇండ్లండ్, భారత్ మధ్య జరిగే టెస్టు మ్యాచ్ను అడ్డుకోవాలని అతను సోషల్ మీడియాలో ఓ వీడియోలో అప్లోడ్ చేశాడు. మ్యాచ్ను అడ్డుకోవాలంటూ ఆయన సీపీఐ దళాన్ని కోరారు. ఈనెల 23వ తేదీ నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో జరగనున్నది. మంగళవారమే ఇంగ్లండ్ జట్టు రాంచీ చేరుకున్నది.
ఉగ్రవాది పన్నున్పై దుర్వా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐటీ చట్టం ప్రకారం ఆ ఫిర్యాదు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్లు హతియా డీఎస్పీ పీకే మిశ్రా తెలిపారు. ఉగ్రవాది పన్నున్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2019 నుంచి నిఘా పెట్టింది. అమెరికాలో ఉంటూ పంజాబ్లో బీభత్సం సృష్టిస్తున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
పన్నున్కు నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. 2021, ఫిబ్రవరి 3వ తేదీన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆ వారెంట్ ఇచ్చింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీన అతన్ని నేరస్థుడిగా కూడా ప్రకటించారు.