పుణె : ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ పరాజయాల బాటలోనే కొనసాగుతోంది. బుధవారం యు ముంబాతో జరిగిన పోరులో టైటాన్స్ 37-40 స్కోరుతో ఓడిపోయింది. విరామానికి 14-18తో వెనుకంజలో ఉన్న టైటాన్స్ చివరి వరకు పోరాటపటిమ ప్రదర్శించినా ఫలితం లేకపోయింది. టైటాన్స్ జట్టులో సిద్ధార్ధ్ దేశాయ్ మ్యాచ్లోనే అత్యధికంగా 18 పాయింట్లు సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. పర్వేష్ 8, మొహసేన్ 3 పాయింట్లతో పర్వాలేదనిపించారు. ముంబై జట్టులో ఆశిష్ 12, ప్రణయ్ రాణె 6, సురిందర్, హైదరాలి, మోహిత్ తలా 4 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్-తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 41-41తో టైగా ముగిసింది. బెంగాల్ జట్టులో మణిందర్ సింగ్ 19, దీపక్ హుడా 11, శ్రీకాంత్ జాదవ్ 3, తలైవాస్ జట్టులో నరేందర్ 15, అజింక్య పవార్ 9, మోహిత్ 5, అభిషేక్ 3 పాయింట్లు సాధించారు.