కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మాయి పీవీ సింధు జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 21-13, 14-21, 21-12తో టాప్సీడ్ చైనా అమ్మాయి హాన్ యూపై కష్టపడి గెలిచింది. 55 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో హాన్ను చిత్తు చేయడంతో గత నెల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఓటమికి సింధు బదులు తీర్చుకున్నైట్టెంది.
మరో క్వార్టర్స్లో అష్మిత చాలిహా 10-21, 15-21తో చైనాకే చెందిన జంగ్ యి మన్ చేతిలో వరుస గేమ్లలో ఓడింది. అష్మిత సైతం ఓడటంతో ఈ టోర్నీలో భారత్ నుంచి సింధు మాత్రమే పోటీలో ఉంది.