Vritti Agarwal | హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్గేమ్స్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి ధమాకా కొనసాగిస్తున్నది. ఇప్పటికే మూడు స్వర్ణాలు సాధించిన వ్రితి.. తాజాగా మరో రెండింటిని ఖాతాలో వేసుకుంది. ఖేలోఇండియా యూత్ గేమ్స్లో ఐదు స్వర్ణాలు గెలిచిన ఏకైక స్విమ్మర్గా వ్రితి నిలిచింది.
బుధవారం జరిగిన మహిళల 1500మీటర్ల ఫ్రీ స్టయిల్ ఈవెంట్లో వ్రితి(17:59:51సె) అగ్రస్థానంతో పసిడి దక్కించుకోగా, అదితి, శ్రీచరణి వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 200మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లోనూ వ్రితి మరో పసిడి సొంతం చేసుకుంది. మరోవైపు మహిళల టెన్నిస్ సింగిల్స్లో రాష్ర్టానికి చెందిన లక్ష్మి దండు రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన ఫైనల్లో లక్ష్మి 1-6, 3-6తో మాయా రాజేశ్వరి(తమిళనాడు) చేతిలో ఓడింది.