పనాజీ: గోవా వేదికగా జరుగుతున్న 37వ జాతీయ గేమ్స్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతకాల వేట కొనసాగుతున్నది. బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్లో కచ్చితంగా పతకం ఖాతాలో వేసుకుంటున్న వ్రితి తన జోరు కొనసాగిస్తున్నది. శుక్రవారం జరిగిన మహిళల 400మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి 4:30:03 టైమింగ్తో రెండో స్థానంతో రజతం సొంతం చేసుకుంది.
భవ్య సచ్దేవ్(4:27:93, ఢిల్లీ), శిరిణ్(4:34:74, కర్నాటక) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే టెన్నిస్ మహిళల డబుల్స్ సెమీస్లో శ్రీవల్లి రష్మిక, శ్రావ్య శివానీ జోడీ 6-4, 6-7(5), 10-5తో శర్మద బాలు, సోహా సాదిక్ ద్వయంపై గెలిచి ఫైనల్లోకి ప్రవేవించింది. సింగిల్స్ క్వార్టర్స్లో రష్మిక 6-0, 6-3తో సుహిత(కర్నాటక)పై గెలిచి సెమీస్లోకి దూసుకెళ్లింది.