హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్ల పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన వేర్వేరు క్రీడా విభాగాల్లో వ్రితి అగర్వాల్, వీ లోకేశ్ పసిడి పతకాలతో మెరిశారు. పురుషుల ఫెన్సింగ్ ఎపీ ఈవెంట్లో లోకేశ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ 15-14స్కోర్తో అగ్రస్థానంలో నిలిచాడు. లైశ్రామ్(పశ్చిమబెంగాల్), నీర్(హర్యానా), కానెసింగ్(మణిపూర్) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800మీటర్ల ఫ్రీైస్టెల్ స్విమ్మింగ్లో రాష్ట్ర స్టార్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ 9.35.61 సెకన్ల టైమింగ్తో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. భవ్య సచ్దేవా(9.40.75సె), రుజుల (10.00.35సె) వరుసగా రజత, కాంస్య ప తకాలు కైవసం చేసుకున్నారు. మహిళల రోయింగ్ స్కల్ ఈవెంట్లో హేమలత (4.31.25సె) ఫైనల్లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకుంది. ఓవరాల్గా ఐదు స్వ ర్ణాలు, మూడు రజతాలు, ఆరు కాంస్య పతకాలతో తెలంగాణ 11వ స్థానంలో కొనసాగుతుండగా, మహారాష్ట్ర(89) టాప్లో ఉంది.