హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ అండర్-9 బాలికల చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన సంహిత పుంగవనం విజేతగా నిలిచింది. జార్ఖండ్ వేదికగా జరిగిన టోర్నీలో సంహిత మొత్తం 11 రౌండ్లలో పది పాయింట్లు సొంతం చేసుకుంది.
ఆఖరిదైన పదకొండో రౌండ్లో తమిళనాడుకు చెందిన టాప్సీడ్ ప్లేయర్ శ్రావణికపై అద్భుత విజయం సాధించింది. నల్లపావులతో బరిలోకి దిగిన సంహిత 35 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. గురువారం ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో సంహితను రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ సన్మానించారు.