హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక ప్రదర్శన ఆకట్టుకుంటున్నది. శుక్రవారం జరిగిన పురుషుల 200మీటర్ల వ్యక్తిగత మెడ్లెలో రాష్ట్ర యువ స్విమ్మర్ సాయి నిహార్ 2: 12:70 సెకన్ల టైమింగ్తో రజతం సొంతం చేసుకున్నాడు.
మరోవైపు పురుషుల ఫెన్సింగ్ టీమ్ సేబర్ ఈవెంట్లో ఇమ్రాన్, శివ, శ్రవణ్, హరితో కూడిన రాష్ట్ర జట్టు కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. దీంతో పాటు బాలుర ఫెన్సింగ్ టీమ్ ఓవరాల్ రన్నరప్ను దక్కించుకుంది. ఇప్పటి వరకు తెలంగాణ జట్టు 24 పతకాలతో 14వ స్థానంలో కొనసాగుతున్నది.