హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఏఐటీఏ జాతీయ టెన్నిస్ టోర్నీలో లక్ష్మిసిరి దండు, సామా చెవికారెడ్డి సెమీస్లోకి దూసుకెళ్లారు.
గురువారం జరిగిన బాలికల అండర్-18 క్వార్టర్స్ పోరు లో లక్ష్మి 6-4, 5-7, 6-1తో మనోజ్ఞ (ఆంధ్రప్రదేశ్) పై అద్భుత విజయం సాధించింది. మరో క్వార్టర్స్లో చెవిక 6-1, 6-4తో లక్షణ నీలాపై అలవోక విజయంతో ముందంజ వేసింది.