గోవా: డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీకి తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ నేరుగా అర్హత సాధించింది. గోవా వేదికగా ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో శ్రీజ బరిలోకి దిగనుంది. ఈ యువ ప్యాడ్లర్తో పాటు మనికా బాత్రా, హర్మన్ప్రీత్ దేశాయ్ భారత్ తరఫున సింగిల్స్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రస్తుతం టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో 89వ ర్యాంక్లో ఉన్న శ్రీజ..సింగిల్స్ మెయిన్ డ్రాలో చోటు దక్కించుకుంది.
మరోవైపు ప్రపంచ ఐదో ర్యాంకర్ హ్యుగో కాల్డ్రెనో సింగిల్స్లో టైటిల్ ఫెవరేట్గా బరిలోకి దిగుతున్నాడు. యూత్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన ఈ బ్రెజిల్ ప్యాడ్లర్ డబ్యూటీటీ టోర్నీలో సత్తాచాటేందుకు తహతహలాడుతున్నాడు. భారత్ నుంచి మిక్స్డ్ డబుల్స్లో మనిక, సాతియాన్ జ్ఞానశేఖరన్, మహిళల డబుల్స్లో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ, పురుషుల డబుల్స్లో సాతియాన్, శరత్ కమల్, మానుశ్ షా, మానవ్ థక్కర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.