హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కెనడా వేదికగా జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్గేమ్స్లో తెలంగాణ ఐదు పతకాలతో తళుక్కుమంది. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల నుంచి దాదాపు ఎనిమిది వేల మంది పోటీపడ్డ మెగాటోర్నీలో రాచకొండ డీసీపీ(రోడ్ సేఫ్టీ వింగ్) శ్రీబాల..బ్యాడ్మింటన్, టీటీలో సత్తాచాటింది. ప్రపంచ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో పోటీపడి పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన శ్రీబాలను డీజీపీ అంజనీకుమార్ మంగళవారం ఘనంగా సన్మానించారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తూనే..మరోవైపు క్రీడల్లో పతకాలు సాధించడం గొప్ప విషయమన్నారు. శ్రీబాల నిబద్ధత, క్రీడల్లో అద్భుత ప్రదర్శన, కృషి ఆమెకు పతకాలు సాధించడంలో దోహదం చేశాయన్నారు. ఈ సందర్భంగా అదనపు డీజీలు అభిలాష బిస్త్, సంజయ్కుమార్జైన్ ఆమెకు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే శ్రీబాల..బ్యాడ్మింటన్లో స్వర్ణం సహా కాంస్యం గెలుచుకోగా, టీటీలో రెండు రజతాలు, కాంస్యం దక్కించుకుంది.