హైదరాబాద్, ఆట ప్రతినిధి: న్యూఢిల్లీ వేదికగా ఆల్ఇండియా సబ్ జూనియర్ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. రెండు రోజుల పాటు జరిగిన టోర్నీలో శివ దీపేశ్(50కి), వేదాంశ్ ప్రసాద్(45కి), అలేటి అభినవ్(50కి), శ్లోక్ పాప్రికర్(40కి), అర్జున్ అభిలాష్(50కి)తో కూడిన తెలంగాణ టీమ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. బాలుర అండర్-12 విభాగంలో శివ దీపేశ్ విజేతగా నిలిచాడు.