హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు చాంపియన్గా నిలిచింది. కటక్ వేదికగా జరిగిన ఫైనల్లో మురళి, లోకేశ్, వంశీ, శశాంక్తో కూడిన తెలంగాణ జట్టు 45-28తో మధ్యప్రదేశ్పై గెలిచి పసిడి పతకం కైవసం చేసుకుంది. బాలికల సబ్రే టీమ్ ఈవెంట్లో గౌరీ, సమీక్ష, బేబీరెడ్డి, శిరీషతో కూడిన తెలంగాణ బృందం రజత పతకం సాధించగా.. బాలుర ఫాయిల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టుకు కాంస్యం దక్కింది. జాతీయ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.