జాతీయ స్థాయిలో జరిగే మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం తెలంగాణ రాష్ట్రం జట్టును ప్రకటించింది. మహిళల అండర్ 17 నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో తలపడే జట్టును తెలగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) ప్రకటించింది. ఈ నెల 18 నుంచి జులై 4 వరకు అసోంలోని గువాహతి వేదికగా ఈ టోర్నమెంటు జరగనుంది.
తెలంగాణ జట్టు: ఎన్. రష్మికా గౌడ్, పి. శ్రీజ, పి. శ్రేష్ఠ, ఎ. సుశాంతిక, జె. లాస్య, ఎం. అంజలి, పి. సోని, టి. నగ్మ, కె. నిఖిత, తన్వీ రాజ్, ఎం. అలేఖ్య, ఎం. మౌనిక, కృష్ణ ప్రియ, ఎస్. గ్రీష్ణ, ప్రియా రాయ్, ఎం. రక్షితా రెడ్డి, ఎం. నందిని, టి. సిరి, జి. మహేశ్వరి, ఎస్కే. సౌమ్యా ప్రవీణ్.
చీఫ్ కోచ్: జి. నాగరాజు
కోచ్: అక్బర్ నవాబ్
మేనేజర్: వనిత
పిజియో: ఇ. ప్రియాంక