హైదరాబాద్: చాంగ్వాన్(చైనా) వేదికగా జరుగుతున్న ప్రపంచ పారా షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ షూటర్ సందేశ్రెడ్డి రజత పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో సింగ్రాజ్, దీపేందర్సింగ్తో కలిసి సందేశ్ రెండో స్థానంలో నిలిచాడు. సరిగ్గా 16 ఏండ్ల క్రితం సరైన ఆదరణ లేక పారా షూటింగ్ నుంచి తప్పుకున్న సందేశ్ 2020లో పునరాగమనం చేశాడు.
ఈ ఏడాది జరిగిన జాతీయ టోర్నీలో సత్తాచాటుతూ రెండు రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ప్రపంచకప్ కోసం భారత జట్టులో సందేశ్ చోటు దక్కించుకున్నాడు. రెండేండ్లు అతడు పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికిందని సందేశ్ తండ్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఈ 32 ఏండ్ల షూటర్ భవిష్యత్లో దేశానికి మరిన్ని పతకాలు తీసుకొస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.