హైదరాబాద్: జాతీయ స్థాయిలో జరిగే ఫెన్సింగ్ పోటీలకు తెలంగాణ జట్టు ఎంపిక పూర్తయింది. ఈ 32వ జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ పోటీలు పంజాబ్లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ వేదికగా ఈనెల 13 నుంచి 16 వరకు జరుగుతాయి. ఈ ఛాంపియన్షిప్ కోసం 24 మందితో తెలంగాణ జట్టును ఎంపిక చేశారు.
వీళ్లు ఫాయిల్, ఎపీ, సబ్రె విభాగాల్లో పోటీ పడతారు. ఈ జాబితాలో మురళీ, శ్రవణ్కుమార్, నజియా, బాబీరెడ్డి, మణికంఠ, లోకేశ్తో పాటు పలువురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. కాగా, మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్లో ఈనెల 5న తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల సీనియర్ ఫెన్సింగ్ టోర్నీ నిర్వహించారు.
ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఫెన్సర్లను సీనియర్ టోర్నీ కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్రెడ్డి, ట్రెజరర్ సందీప్ పేర్కొన్నారు.