హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా సెయిలింగ్ చాంపియన్షిప్నకు ఎంపికైన తెలంగాణ సెయిలర్లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఈ నెల 27 నుంచి అబుదాబి వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి మన రాష్ట్రం నుంచి అశ్విని, కీర్తి, సంజయ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ ముగ్గురు లేజర్ 4.7 విభాగంలో పోటీ పడనున్నారు. హకీంపేట్ క్రీడా పాఠశాలకు చెందిన వీరిని శుక్రవారం మంత్రి తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నాం’ అని అన్నారు. అనంతరం సాట్స్ ఆర్చరీ కోచ్ రవిశంకర్ పల్లెలను కూడా మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ, ఆర్కే బోస్ తదితరులు పాల్గొన్నారు.