హైదరాబాద్, ఆట ప్రతినిధి: దక్షిణకొరియా వేదికగా జరిగిన ఆసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు పతకాల పంట పండించారు. తెలంగాణ తరఫున బరిలోకి దిగిన 32 మంది ప్లేయర్లు 24 పతకాలు సొంతం చేసుకున్నారు.
పురుషుల డిస్కస్త్రోలో జగ్జీవన్రెడ్డికి, ట్రిపుల్ జంప్లో వేణుమాధవ్కు రజతాలు, ట్రిపుల్ చేజ్లో అనిల్కు స్వర్ణం, కాంస్యం, గోపాల్ నాయక్కు పసిడి, రజతం, శుభమిత్రకు రజతం, కాంస్యం కైవసం చేసుకున్నారు. బ్యాడ్మింటన్లో పవన్రెడ్డి(2కాంస్యాలు), సుమతి(రజతం, కాంస్యం) పతకాలు దక్కించుకున్నారు.