కడ్తాల్, మే 31ః తెలంగాణ కుర్రాడు నక్క శివ జాతీయ వాలీబాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా రావిచేడ్ గ్రామానికి చెందిన శివ గతనెల హర్యానాలో నిర్వహించిన అండర్-19 రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటాడు. జూన్ 8వ తేదీ నుంచి నేపాల్లో జరుగనున్న అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో అతడు బరిలోకి దిగనున్నాడు. ఈ సందర్భంగా సోమవారం శివను రావిచేడ్ గ్రామంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ భారతమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.