హైదరాబాద్, ఆటప్రతినిధి: జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజత పతకం కైవసం చేసుకుంది.
అస్సాం వేదికగా జరుగుతున్న టోర్నీలో మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రిత్తి 4 నిమిషాల 33.25 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఈ పోటీలో భవ్య (4:30.25), శివంగి (4:35.83) వరుసగా స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు.