హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు హవా కొనసాగిస్తున్నారు. గువాహటి వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ బాలుర ట్రిపుల్ జంప్లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు చెందిన ప్రణయ్ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. బాలికల 100 మీటర్ల హర్డిల్స్లో రుచిత స్వర్ణం చేజిక్కించుకోగా.. ప్రణతి లలిత రజత పతకం గెలుచుకుంది. మెడ్లే రిలేలో హర్షవర్ధన్-షేక్ అజారుద్దీన్ జోడీ కాంస్యం పతకం సాధించింది. హెక్టాథ్లాన్ (100 మీటర్ల పరుగు, 1000 మీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్, జావెలిన్ త్రో, షాట్పుట్)లో రాజ్కుమార్ కాంస్యం కైవసం చేసుకున్నాడు.