హైదరాబాద్, ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరుగుతున్న జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన అండర్-18 బాలికల 200 మీటర్ల రేసులో సాయిసంగీత స్వర్ణ పతకంతో మెరిసింది. రేసును 25.39 సెకన్లలో ముగించిన ఈ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ అథ్లెట్ అగ్రస్థానంలో నిలువగా, ఆకాంక్ష (25.49సె), రుతిక (25.52సె) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.