హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ బాలుర సబ్ జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో ఆతిథ్య తెలంగాణ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగి న క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ 26-15 తేడాతో చం డీగఢ్పై అద్భుత విజయం సాధించింది. ఆది నుం చి దూకుడు కనబరిచిన మన జట్టు..ప్రథమార్ధం ముగిసేసరికి 14-7తో ఆధిక్యంలో నిలిచింది. ఇదే అదునుగా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుకుంటూ పో యిన తెలంగాణ వరుస పాయింట్లతో ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. మిగతా క్వార్టర్స్ మ్యాచ్ల్లో ఆంధ్రప్రదేశ్ 35-30తో బీహార్పై, రాజస్థాన్ 35-30తో హర్యానా పై గెలిచి సెమీస్ బెర్తు దక్కించుకున్నాయి.