ఇంకొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య పోరు ప్రారంభం కానుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్కు సిద్ధం అయిపోయి.. స్టేడియానికి బయలుదేరారు. టీమిండియా ప్లేయర్లు, కోచ్, మెంటర్.. అందరూ కలిసి స్టేడియానికి వెళ్లడానికి హోటల్ నుంచి బయలు దేరారు. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.