హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(హెచ్పీజీఎల్) మూడో సీజన్ ఆసక్తికరంగా సాగుతున్నది. గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ గోల్ఫ్ కోర్సులో లీగ్లోని మిగిలిన రెండు మ్యాచ్లు శుక్రవారం జరిగాయి. మూడుకు మూడు మ్యాచ్ల్లో గెలిచి ఆదిత్య జమాల్ 30పాయింట్లు దక్కించుకోవడం ద్వారా టీమ్ ఎమ్వైఎస్ఏ(639) గ్రూపు-డీలో టాప్లోకి దూసుకొచ్చింది. గ్రూపు-ఏలో మీనాక్షి మావెరిక్స్ (634), గ్రూపు-బిలో సింతోకెమ్ స్వింగ్కింగ్స్ (614), గ్రూపు-సీలో టీమ్ అల్ఫా (610) అగ్రస్థానం దక్కించుకున్నాయి. శనివారం జరిగే ఆఖరి రౌండ్ల ద్వారా నాకౌట్కు అర్హత సాధించే జట్లు ఏవో తేలనున్నాయి.