న్యూఢిల్లీ: టీమ్ఇండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్..ఐపీఎల్తో పాటు ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ టోర్నీకి పూర్తిగా దూరం కాబోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో శ్రేయాస్ గాయపడ్డాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న శ్రేయాస్కు త్వరలో శస్త్రచికిత్స జరుగుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
వెన్నెముక గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఐదు నెలల సమయం పట్టే అవకాశముందని తెలిపాయి. ఈ కారణంగా ఇప్పటికే ఐపీఎల్కు దూరమైన అయ్యర్ స్థానంలో కోల్కతా నైట్రైడర్స్ టీమ్కు నితిశ్ రానా నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.