India Vs SA ODI | జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ముందు దక్షిణాఫ్రికా భారీ లక్షాన్నే ఉంచింది. నిర్దేశిత 50 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. క్రీజ్లో డేవిడ్ మిల్లర్ 21, వాయ్నే పర్నెల్ 15 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. తొలుత పొదుపుగా బౌలింగ్ చేసిన టీం ఇండియా బౌలర్లు 15 ఓవర్ల తర్వాత పట్టు విడవడంతో సఫారీలు చెలరేగిపోయారు. తొలి వన్డేలోనూ భారీ స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా చేతిలో టీం ఇండియా ఓటమి పాలైంది. టీ-20 వరల్డ్ కప్ కోసం టీం ఇండియా ప్రధాన ఆటగాళ్లు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో సఫారీల ముంగిట టీం ఇండియా బౌలర్లు నిలవలేకపోతున్నారు.
40 ఓవర్లకే ఓపెనర్లు (క్వింటాన్ డికాక్ 5, జన్నేమాన్ మలాన్ 25) పెవిలియన్ బాట పట్టడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను రీజా హెండ్రిక్స్, అడైన్ మార్క్రమ్ చేపట్టారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 129 పరుగులు జత చేశారు. రీజా హెండ్రిక్స్ 74, అడెన్ మార్క్రమ్ 79 పరుగులతో జట్టును ఆదుకున్నారు. జట్టు స్కోర్ 169 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ రీజా హెండ్రిక్స్ భారీ షాట్కు ప్రయత్నించి, బౌండరీ వద్ద షాబాద్ అహ్మద్ చేతికి చిక్కాడు.
తర్వాత అడెన్ మార్క్రమ్కు హెన్రిచ్ క్లాసిన్ జత కలిశాడు. అడెన్ మార్క్రమ్ 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో శిఖార్ ధావన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. హెడ్రిన్ క్లాసిన్ 30 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సిరాజ్కు చిక్కాడు. 47వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన రెండో బంతిని శ్రేయస్ అయ్యర్కు హెన్రిక్ క్లాసిన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఔటయ్యే సమయానికి క్లాసిన్ వ్యక్తిగత స్కోర్ 16పరుగులు.
టీం ఇండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. నాలుగు ఓవర్లలోనే శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు, వాషింగ్టన్ సుందర్ తొమ్మిది ఓవర్లలో 60 పరుగులు ధారాళంగా ఇచ్చారు.