IND vs ENG | ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇప్పటికే 3-1తో సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టుకు ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐదో టెస్టుకు శుభవార్త. రాంచీ టెస్టుకు దూరమైన టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా.. ధర్మశాలలో ఆడే అవకాశమున్నట్టు సమాచారం. ఈ మేరకు అతడు టీమ్ మేనేజ్మెంట్కు ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా.. నాలుగో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.
రాంచీ టెస్టులో బుమ్రా గైర్హాజరీ కారణంగా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి టెస్టులోనే అతడు ఆకట్టుకున్నాడు. రాంచీలో గెలిచి భారత్ సిరీస్ నెగ్గిన నేపథ్యంలో భారత జట్టు ఐదో టెస్టులో ప్రయోగాలు చేసే అవకాశమున్నదని, సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి కొత్త కుర్రాళ్లకు ఛాన్స్లు ఇవ్వనున్నట్టు గతంలో వార్తలు వచ్చినా ఐదో టెస్టుకు మాత్రం బుమ్రాను ఆడించనున్నట్టు తెలుస్తున్నది. బుమ్రా వస్తే సిరాజ్కు రెస్ట్ ఇవ్వొచ్చు. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్న వేళ.. స్పిన్ ఎటాక్ కంటే పేసర్లతో ఇంగ్లండ్కు కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. ఇందులో భాగంగానే బుమ్రాను ఐదో టెస్టులో ఆడించనున్నారని సమాచారం.
Jasprit Bumrah set to return for the 5th Test against England.
– KL Rahul doubtful. (Cricbuzz). pic.twitter.com/DyYhDoMoAt
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2024
ఇక టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ధర్మశాల టెస్టులో కూడా ఆడేది అనుమానమే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు.. మెరుగైన వైద్యానికి త్వరలోనే లండన్కు వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడు ఈ టెస్టుకు దూరమవ్వనున్నాడు. ఇక మూడు టెస్టులలో విఫలమైన రజత్ పాటిదార్కు ఐదో టెస్టులో రెస్ట్ ఇచ్చి పడిక్కల్ను తుది జట్టులో ఆడించే అవకాశాలున్నాయి. ఇండియా – ఇంగ్లండ్ మధ్య ఆఖరి టెస్టు.. మార్చి 07 నుంచి ధర్మశాల వేదికగా మొదలుకానుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్.. సుమారు రెండున్నర నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడదు. ఐదో టెస్టు ముగిసిన కొద్దిరోజులకే ఐపీఎల్ (మార్చి 22 నుంచి) మొదలవనుంది.