ముంబై: ఐసీసీ వన్డే వరల్డ్కప్(World Cup 2023) కోసం టీమిండియా జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో ఉన్న బృందాన్ని ప్రకటించారు. గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను 15 మంది సభ్యుల జట్టులోకి తీసుకున్నారు. అయితే తిలక్ వర్మ, సంజూ సాంసన్లను వదిలేశారు.
చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఇవాళ మీడియా ముందు వరల్డ్ కప్ జట్టును ప్రకటించారు. ఆ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక టాప్ ఆర్డర్లో శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు. బౌలర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, షమీ, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లకు కూడా ఆ బృందంలో చోటు కల్పించారు.
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023