కెంట్(ఇంగ్లండ్): ఇంగ్లండ్ కౌంటీల్లో టీమ్ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఇరుగదీస్తున్నాడు. స్వదేశం వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో చోటు దక్కించుకోలేకపోయిన చాహల్.. కౌంటీల్లో కెంట్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం నాటింగ్హామ్షైర్తో మొదలైన మ్యాచ్లో బరిలోకి దిగిన చాహల్ (3/63) మూడు వికెట్లతో విజృంభించాడు.
నాటింగ్హామ్షైర్ బ్యాటర్లు మాథ్యూ మాంట్గోమెరీ, లిండన్ జేమ్స్, కెల్విన్ హారిసన్ వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.