IND vs WI | భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లకు భారత్.. 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి.. వెస్టిండీస్కు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. చెలరేగిపోయి ఆడాడు. 7 సిక్సులు కొట్టి.. టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. 31 బంతుల్లో యాదవ్.. 65 పరుగులు చేసి చివరి బంతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఓపెనర్లలో ఇషాన్ కిషన్ 34 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 35, శ్రెయాస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. సూర్య, వెంకటేశ్ ఇద్దరి భాగస్వామ్యంతో టీమిండియాకు భారీ స్కోర్ను అందించారు. వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్, షెఫర్డ్, రోస్టన్, హైదెన్, డొమినిక్ తలో వికెట్ తీశారు.
FIFTY!
A brilliant half-century from @surya_14kumar. This is his 4th in T20Is.
Live – https://t.co/e1c4fOY0JR #INDvWI @Paytm pic.twitter.com/hJmGkmIt5O
— BCCI (@BCCI) February 20, 2022
Innings Break!
A 37-ball 91-run stand between @surya_14kumar (65) and Venkatesh Iyer 35* powers #TeamIndia to 184/5. 💪 💪
Over to our bowlers now. 👍 👍 #INDvWI | @Paytm Scorecard ▶️ https://t.co/2nbPwMZwOW pic.twitter.com/1QbTNAk0V5
— BCCI (@BCCI) February 20, 2022