సిడ్నీ: సాధన అనంతరం చల్లటి శాండ్విచ్లను ఆహారంగా అందించడంపట్ల టీమ్ ఇండియా ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం తమ రెండో మ్యాచ్లో రోహిత్ సేన నెదర్లాండ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో టీమ్ ఇండియా ఆటగాళ్లు ఇక్కడ ముమ్మర సాధన చేశారు. అయితే సాధన అనంతరం అందజేసిన ఆహారంలో చల్లటి పదార్ధాలు అందజేయడంతో భారత ఆటగాళ్లు చాలామంది హోటల్కు వెళ్లి భోజనం చేయాటానికి ప్రాధాన్యం ఇచ్చారు. కొంతమంది పండ్లు తిని తమ క్షుద్బాధను తీర్చుకున్నారు.
సాధన సమయంలో లేదా మ్యాచ్ రోజున టోర్నీ నిర్వాహకులే ఆహారం అందజేయాలి. వివిధ జట్ల అవసరాలకు అనుగుణంగా మెనూ అందించాలి. కానీ భారత ఆటగాళ్లకు ఇష్టమైన పదార్ధాలను అందించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా విఫలమైంది. భారత ఆటగాళ్ల ఇబ్బందిని గమనించామని, వారి సమస్యను పరిష్కరిస్తామని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు. ఇకపైనైనా బీసీసీఐ టీమ్ ఇండియా సభ్యుల ఆహార సమస్యపై దష్టి సారిస్తారో లేదో చూడాలి.