అహ్మదాబాద్: ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించే దిశగా వెళ్తోంది ఇంగ్లండ్. టీమిండియా మిడిలార్డర్ విఫలం కావడంతో టీ సమయానికి 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ (36), వాషింగ్టన్ సుందర్ (1) ఉన్నారు. ఇంకా ఇంగ్లండ్ కంటే 52 పరుగులు వెనుకబడే ఉండటంతో.. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆధిక్యం సందేహంగానే కనిపిస్తోంది. కెప్టెన్ కోహ్లి (0)తోపాటు పుజారా (17), రహానే (27), అశ్విన్ (13) విఫలమయ్యారు. రోహిత్ శర్మ 49 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్, లీచ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.