India Vs SA ODI | దక్షిణాఫ్రికాతో పోలిస్తే టీం ఇండియా ఒత్తిడికి గురవుతున్నది. లక్నోలో జరుగుతున్న తొలి వన్డేలో 22.3 ఓవర్లకు టీం ఇండియా సెంచరీ మార్క్ దాటింది. టీం ఇండియా ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ మాత్రమే క్రీజ్లో నిలకడగా ఆడుతున్నాడు. 24 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు.
టీం ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 250 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో ఒత్తిడికి గురైన టీం ఇండియా ప్లేయర్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. 8 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు ఔటై క్రీజ్ను వీడారు. కానీ 20 ఓవర్లు పూర్తయ్యే సరికి కేవలం 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి టీం ఇండియా కష్టాల్లో చిక్కుకుంది. వన్డౌన్గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. షంషీ బౌలింగ్లో డికాక్ చేతిలో స్టంపవుట్ అయ్యాడు. ఔటయ్యే సమయానికి గైక్వాడ్ 19 పరుగులు చేశాడు. ఇషాన్ కిషాన్ 20 పరుగులు, గైక్వాడ్ 19 పరుగులతో కాస్త నిలకడగా ఆడారు. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ 17, సంజూ శాంసన్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
అంతకుముందు ఆరో ఓవర్లో పావెల్ వేసిన తొలి బంతికి కెప్టెన్ శిఖార్ ధావన్ బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. అంతకుముందు మూడో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ శుభ్మన్ గిల్.. దక్షిణాఫ్రికా బౌలర్ రబడా చేతిలో బౌల్డయ్యాడు. అప్పటికి టీం ఇండియా స్కోర్ కేవలం ఎనిమిది పరుగులే. అంతకుముందు నిర్ణీత 40 ఓవర్లు పూర్తయ్యే సరికి సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేశారు.