ముంబై : టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా సన్నద్ధమవుతున్నది. అంతకు ముందు స్వదేశంలో ఈ నెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరిస్ ఆడనున్నది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఓపెనర్గా విరాట్ జట్టుకు మంచి ఎంపిక అని తెలిపాడు.
ఓపెనింగ్స్ స్థానం కోసం జట్టులో చాలా ఆప్షన్లు ఉన్నాయని, ముఖ్యంగా ప్రపంచకప్లో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. జట్టులో ఆటగాళ్లు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసినా అద్భుతంగా రాణించాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపాడు. వరల్డ్కప్లో బ్యాటింగ్ ఆర్డర్లో తాము ప్రయోగాలు చేయవచ్చునని, ఇందులో విరాట్కు ఓపెనర్గా చాన్స్ ఉందని రోహిత్ పేర్కొన్నాడు.
ఓపెనర్గా విరాట్ తమకు మంచి ఎంపిక అని, ఆర్సీబీ తరఫున ఇన్సింగ్స్ను ప్రారంభించి అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు. అందుకే కోహ్లి తమ ప్రణాళికలో ఓపెనర్గా ఉంటాడని, అందుకే మెగా ఈవెంట్కు మూడో ఓపెనర్ను ఎంపిక చేయలేదని చెప్పాడు. ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లి ఇటీవల జరిగిన ఆసియా కప్లో భారత్ చివరి మ్యాచ్లో ఇన్నింగ్స్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో అజేయంగా 122 పరుగులు సాధించాడు. అయితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్కు ఇదే తొలి సెంచరీ. గతంలో ఐపీఎల్లో బెంగళూరు తరఫున ఇన్సింగ్స్ను ప్రారంభించి.. ఐదు సెంచరీలు సైతం సాధించాడు. ఆఫ్ఘనిస్థాన్పై సెంచరీ చేసిన తర్వాత.. విరాట్ను ఓపెనర్గా పంపాలని మాజీలు సూచిస్తున్నారు. అయితే, విరాట్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ లేదంటే వైస్ కెప్టెన్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంటుంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్.